News November 8, 2024
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి కన్నుమూత

మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణించారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె చనిపోయారు. జ్యోతి దేవి మృతితో మెట్పల్లి పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కాగా జ్యోతి భర్త, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు గతేడాది మృతిచెందారు.
Similar News
News December 27, 2025
కరీంనగర్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన లెప్రసీ, పల్స్ పోలియో బిల్లులను చెల్లించాలని శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆశావర్కర్లు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ.. ఈ బిల్లులపై డీఎంహెచ్ఓ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించే వరకు పోరాడుతామన్నారు.
News December 27, 2025
సర్పంచ్లే గ్రామాభివృద్ధి సారథులు: మంత్రి పొన్నం

కరీంనగర్ డీసీసీలో నూతన కాంగ్రెస్ సర్పంచ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సర్పంచ్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అభివృద్ధి నిధులు త్వరలో వస్తాయని భరోసానిచ్చారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. రేపు గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.
News December 27, 2025
సహకార రంగ బలోపేతమే దేశాభివృద్ధికి మూలం: ఈటల

సహకార వ్యవస్థ బలోపేతంతోనే దేశం ముందుకు సాగుతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. KNRలో జరిగిన డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్నారు. రవీందర్ రావు డీసీసీబీ టర్నోవర్ను రూ.400 కోట్ల నుంచి రూ. 8 వేల కోట్లకు చేర్చడం స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగానికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలో అన్ని ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


