News September 10, 2025

మెట్‌పల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

JGTL(D) మెట్‌పల్లి శివారులోని వేంపేట్ రోడ్డులోని BC హాస్టల్ ముందు మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టాటా ACE, ద్విచక్రవాహనం ఢీకొనగా వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడిని వేంపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి నర్సయ్యగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2026

రాత్రి మంచి నిద్ర కోసం..

image

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It

News March 10, 2026

యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

image

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.

News March 10, 2026

వాడిన నూనె వాడితే క్యాన్సర్ ముప్పు: రామయ్య

image

అమలాపురం హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను తిరిగి వాడటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని ఆహార భద్రతా అధికారి రామయ్య హెచ్చరించారు. సోమవారం యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూనెను పదేపదే వేడి చేయడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన నూనెను నిల్వ చేయరాదని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.