News March 7, 2025
మెట్పెల్లి ఏఎంసీ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

మెట్పెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన పసుపు, ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. పసుపులో, ధాన్యంలో రకాల గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పసుపు, ధాన్యం కొనుగోలు ఎలా చేస్తున్నారు. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని అధికారులను అడిగి రైతులతో కాసేపు ముచ్చటించారు. పంటలో వారికి వచ్చే లాభ నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 5, 2026
ఖానాపూర్: బీజేపీ ఛైర్ పర్సన్.. బీఆర్ఎస్ వైస్ ఛైర్మన్

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఛైర్మన్ పదవిని బీజేపీ దక్కించుకోగా, వైస్ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్కు దక్కింది. ఛైర్మన్గా బీజేపీకి చెందిన అంకం మౌనిక, వైస్ ఛైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోహెబ్ ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల మధ్య సాగిన ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు.
News April 5, 2026
MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
News April 5, 2026
పేదల న్యాయం కోసం జగ్జీవన్ రామ్ కృషి: ఎస్పీ స్నేహ మెహ్రా

బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అందరికీ సమానత్వం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పనిచేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.


