News September 15, 2025
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు: భూమన

విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని చిత్తూరు తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి పద్మావతి సూపర్ స్పెషాలిటీలో పెండింగ్లో ఉన్న 20 శాతం పనులను పట్టించుకోవడం లేదన్నారు.
Similar News
News September 15, 2025
NRPT: ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష

ఎలక్టర్ మ్యాపింగ్ టేబుల్ను పకడ్బందీగా తయారు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహశీల్దార్లకు సూచించారు. త్వరలో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్.ఐ.ఆర్ షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో బీఎల్వోలు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన ఉన్న చోట వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
News September 15, 2025
సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

ఆసియా కప్లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో UAE ఘన విజయం సాధించడంతో భారత్కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.
News September 15, 2025
సిరిసిల్లలో ఘనంగా ఇంజినీర్స్ డే

భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంజినీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.