News October 31, 2025
మెదక్తో ఇందిరాగాంధీకి అవినాభావ సంబంధం

మెదక్ ఎంపీగా గెలుపొందిన ఇందిరాగాంధీకి ఉమ్మడి జిల్లాలో అవినాభావ సంబంధం ఉంది. ఎంపీగా మెదక్కు వచ్చి వెళ్లేటప్పుడు చిన్నశంకరంపేట అతిథి గృహంలో బస చేసినట్లు స్థానిక నాయకులు ఆనాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. అలాగే 984లో జరిగిన మెదక్ జిల్లా కాంగ్రెస్ సర్పంచ్ల సదస్సు, సంగారెడ్డిలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మెదక్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు.
Similar News
News October 31, 2025
రేపు కడపకు రానున్న మాజీ ఉప రాష్ట్రపతి

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం కడపకు రానున్నారు. 2వ తేదీ కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగే జానుమద్ది హనుమత్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కడప చేరుకుని రాత్రికి బస చేసి 2న ఉదయం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఆయన చెన్నైకు విమానంలో బయలుదేరి వెళ్తారని అధికారులు వెల్లడించారు.
News October 31, 2025
జనగామ: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి!

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యబోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. విడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనగామ నుంచి కలెక్టర్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.
News October 31, 2025
ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడి, నిందితులను పోలీసులకు అప్పగించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.


