News October 31, 2025
మెదక్లో ఇందిరాగాంధీపై పోటీ చేసిందెవరంటే..?

ఇందిరాగాంధీపై దివంగత కాంగ్రెస్ నేత, ప్రస్తుత సీఎం మామ అయిన సూదిని జైపాల్ రెడ్డి జనతాపార్టీ తరఫున పోటీ చేశారు. జైపాల్ రెడ్డికి ఆ ఎన్నికల్లో 82,453 ఓట్లు రాగా.. ఇందిరకు 3,01,577 ఓట్లు వచ్చాయి. అనంతరం జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జైపాల్ రెడ్డితో పాటు ఇందిరాగాంధీపై పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్, గణిత మేధావి శకుంతలా దేవీ సైతం పోటీ చేశారు.
Similar News
News October 31, 2025
బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్సైట్లను .bank.in డొమైన్కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.
News October 31, 2025
ఏలూరు: 100 రోజుల కార్యాచరణపై డీఈవోతో చర్చ

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరులో తన క్యాంపు కార్యాలయంలో డీఈవో నారాయణతో శుక్రవారం సమావేశమయ్యారు. పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత స్థాయి గణనీయంగా పెంచే విధంగా కృషి చేయాలని ఆమె సూచించారు. ‘విజయ్ కేతనం’ పుస్తకాలను మరింత ముందుగానే పంపిణీ చేస్తామని డీఈవో అన్నారు.
News October 31, 2025
రాజమండ్రి: నవంబర్ 1 నుంచి స్వాభిమాన్ ఉత్సవాలు

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ, సాధికారిత అధికారి కె.ఎన్. జ్యోతి తెలిపారు. గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1న బిర్సా ముండా జ్ఞాపకార్థం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.


