News November 12, 2025
మెదక్: ‘ఆన్లైన్లో సభ్యత్వ నమోదు చేసుకోండి’

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సభ్యత్వ నమోదు కోసం ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ను జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని అందజేశారు.
Similar News
News April 16, 2026
MDK: డిప్లొమా కోర్సుల్లో అనాథ బాలికలకు 70% సీట్లు: కలెక్టర్

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.
News April 16, 2026
మెదక్: ఫీజు రాయితీలకు సర్టిఫికెట్లు కీలకం: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 241 మంది విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
News April 16, 2026
మెదక్: ఫీజు రాయితీలకు సర్టిఫికెట్లు కీలకం: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 241 మంది విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.


