News August 24, 2025
మెదక్: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. ప్రభుత్వ, ZP, మండల పరిషత్, మోడల్ స్కూల్, KGBV పాఠశాలల ప్రిన్సిపల్స్, HMలు, టీచర్లు అర్హులని చెప్పారు. HM/ప్రిన్సిపాల్ 15, ఇతర టీచర్లకు10 ఏళ్ల సర్వీస్ ఉండాలన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 30 లోపు DEO ఆఫీస్లో అందజేయాలన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబర్ 5న సత్కరించనున్నట్లు తెలిపారు.
Similar News
News August 24, 2025
MDK: స్వాతంత్ర్య సమర యోధుడు మృతి

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య (96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
News August 24, 2025
నిజాంపేటలో అనుమానాస్పదంగా మహిళ సూసైడ్

నిజాంపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్న ఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బొంబాయి రాజవ్వ(50) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుందని గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
News August 24, 2025
‘మెతుకు సీమలో కనుమరుగవుతున్న కళలు’

ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!