News March 25, 2024

మెదక్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ !

image

మెదక్‌ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన BRS.. నియోజకవర్గంలో తన కార్యాచరణను ప్రారంభించింది. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఒకటైన మెదక్‌‌పై కేసీఆర్ దృష్టిసారించారు. రేపటి నుంచి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యనేతలతో KCR సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటూ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన హరీశ్‌రావు.. మెదక్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

Similar News

News April 11, 2025

మెదక్: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

image

ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లను ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను https://www.telanganaopenschool.org వెబ్సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 11, 2025

మెదక్: చికిత్స పొందుతూ రైతు మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన ఎల్లయ్య (50) అనే రైతు బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2025

ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్‌కు ఉగాది పురస్కారం

image

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.

error: Content is protected !!