News March 17, 2025

మెదక్: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు: డీఈవో

image

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాలని సూచించారు.

Similar News

News March 17, 2025

తూప్రాన్: తల్లిదండ్రులు మృతి చెందారని.. కొడుకు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన చింతల రాజు (24) తండ్రి బాల నరసయ్య ఏడాది క్రితం మరణించగా, పది రోజుల క్రితం తల్లి పోచమ్మ మృతి చెందింది. మృతి చెందినప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. 12న తల్లి దశదినకర్మ జరిపి, రాత్రి పురుగుల మందు సేవించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు

News March 17, 2025

మెదక్: అగ్ని వీర్ కోసం యువత దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

యువత ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని యువకులు ఇండియన్ ఆర్మీలో చేరి సేవలందించేందుకు ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఉందని అన్నారు. అగ్ని వీర్ కోసం ఈ నెల 12 నుంచి https://www.joinindianarmy.nic.in వెబ్ పోర్టల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 17, 2025

సిద్దిపేట: దంపతుల ఆత్మహత్య.. అనాథలైన చిన్నారులు

image

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దంపతులిద్దరూ ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. ఎల్లారెడ్డి పేటకు చెందిన కెమ్మసారం భాగ్యమ్మ (32) ఉదయం పురుగుల మందు తాగే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి మనస్థాపానికి గురైన భర్త నాగరాజు (35) సైతం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు మీనాక్షి (9), మహేష్(7), లక్కీ (5), శ్రావణ్ (4) అనాథలయ్యారు.

error: Content is protected !!