News March 4, 2025
మెదక్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.. 24 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి

కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ రౌండ్లో బీజేపీ అంజిరెడ్డి 24 ఓట్ల లీడ్లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6697 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News March 4, 2025
మహబూబాబాద్: ‘అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు’

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక కంకరబోర్డు ఏరియాలో అర్ధరాత్రి సమయంలో దొంగలు, అపరిచితులు సంచరిస్తూ ఇంటి తలుపులు కొడుతున్నారని స్థానికులు తెలిపారు. దీంతో తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథి మాట్లాడుతూ.. భయాందోళనకు గురి కావొద్దని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
News March 4, 2025
జగిత్యాల జిల్లాలో 28 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

జగిత్యాల జిల్లాలో 28 ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్ పరీక్షల కన్వీనర్ నారాయణ మంగళవారం తెలిపారు. పరీక్షల నిర్వహణకు కాపీయింగ్ జరగకుండా 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు వారి వెంట ఏ విధమైన ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్, నార్మల్ వాచ్లు, కాలిక్యులేటర్లు తీసుకురావద్దన్నారు.
News March 4, 2025
మూడోసారి బెయిల్ పొందిన రెజ్లర్ సుశీల్ కుమార్

మర్డర్ కేసులో మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50,000 బాండు, 2 ష్యూరిటీలు ఇచ్చాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2021, మేలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ఖడ్ హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు. దీంతో పాటు అల్లర్లు, అక్రమంగా గుమికూడటం వంటి అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 2023, మార్చిలో తండ్రి అంత్యక్రియలు, జులై 23న మోకాలి ఆపరేషన్ కోసం ఆయన వారం పాటు బెయిల్ పొందడం గమనార్హం.