News January 19, 2026

‘మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలి’

image

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లాని రాజన్న సిరిసిల్ల జోన్‌లో గత ప్రభుత్వం అనాలోచితంగా కలిపిందని పలువురు ఆరోపించారు. నిరుద్యోగులు గ్రేడ్-4 స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్‌లో కలిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు.

Similar News

News February 5, 2026

మెదక్: అర్ధరాత్రి మంత్ర పూజలు?

image

శివంపేట మండలంలోని అల్లీపూర్ గ్రామంలో నింగ బాలరాజ్, గోవర్ధన్ అనే అన్నదమ్ముల ఇంటి ముందు అర్ధరాత్రి జరిగిన అనుమానాస్పద పూజలు కలకలం రేపాయి. తెల్లవారుజామున ఇంటి ముందు మంత్ర పూజల గుర్తులు చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఎవరో కావాలనే భయపెట్టేందుకు ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

News February 5, 2026

తూప్రాన్: ఎన్నికల బరిలో తోటి కోడలు

image

తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి ఎన్నికల బరిలో తోటి కోడళ్లు పోటీ చేస్తున్నారు. ఒకరు తాజా మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు నూతనంగా ఎన్నికల బరిలో నిలిచారు. తూప్రాన్ మున్సిపల్ పరిధి 12వ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆమె తోటి కోడలు బొంది రజిని రాఘవేందర్ గౌడ్ 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త రాఘవేందర్ గౌడ్ ఇదే వార్డులో తాజా మాజీ కౌన్సిలర్‌గా ఉన్నారు.

News February 5, 2026

రేగోడ్: టాపర్‌గా నిలవండి.. రూ.5 లక్షలు గెలవండి!

image

రేగోడు, లింగంపల్లి, గజవాడ పాఠశాలల్లో ఓ సంస్థ ఆధ్వర్యంలో ‘చదువుకో తెలంగాణ’పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెన్త్ వార్షిక పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతి అందిస్తారని MEO గురునాథ్ తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి అందిస్తున్న సాయం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.