News February 20, 2025
మెదక్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు

మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ (రెగ్యులర్) చేయాలన్న పిలుపుతో ఆర్టిజన్ ఉద్యోగులు చలో హైదరాబాద్ విద్యుత్ సౌదాకు పిలుపునిచ్చారు. యూనియన్ నాయకుల పిలుపుమేరకు చలో విద్యుత్ సౌదా వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
Similar News
News February 21, 2025
మెదక్లో గ్రాడ్యుయేట్స్ 12,472, టీచర్స్ 1,347 ఓటర్లు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉన్నారు. ఇందులో 8,879 మంది పురుషులు, 3,593 మహిళలున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. ఇందులో పురుషులు 7,99 మంది, మహిళలు 5,48 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 21, 2025
మెదక్: భర్తను హత్య చేసిన భార్య.. UPDATE

<<15507715>>భర్తను హత్య చేసిన<<>> భార్య శివమ్మ, అల్లుడు రమేశ్లను గురువారం రిమాండ్కు తరలించినట్లు మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్న పేటకు చెందిన ఆశయ్య ఈ నెల 15న పొలం వద్ద జారి పడగా కాలు విరిగింది. ఆపరేషన్కు అయ్యే ఖర్చు భరించలేక, ఆపరేషన్ చేసినా నడిచి పొలం పనులు చేయలేడనే అనుమానంతో భార్య, అల్లుడు ఆశయ్యను ఉరేసి హత్య చేశారు. కేసులో భాగంగా ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు వివరించారు.
News February 21, 2025
MDK: వన దుర్గామాతను దర్శించుకున్న సినీహీరో

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, నటుడు పూరీ ఆకాశ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.