News February 12, 2026
మెదక్ జిల్లాలో 81.09 % పోలింగ్

మెదక్ జిల్లాలో 81.09% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారిగా మెదక్లో 80.75 %, రామాయంపేటలో 84.84%, తుప్రాన్లో 81.30%, నర్సాపూర్లో 78.61% పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేటలో అత్యధికంగా 84.84% పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 86,109 మంది ఓటర్లు ఉండగా 69,823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News February 13, 2026
MDK: అనుమతి పత్రం ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి: ఎస్పీ

మెదక్ మున్సిపాలిటీ కౌంటింగ్ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో వెస్లీ కళాశాలలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు సమీక్షించారు. అనుమతి పత్రాలు ఉన్నవారికే ప్రవేశం, కఠిన తనిఖీలు, మొబైల్ ఫోన్ల నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. BNSS 163 అమలులో ఉంటుందని, గుంపులు, ర్యాలీలు, డీజేలు నిషేధమన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 13, 2026
మెదక్: టెన్త్ క్లాస్ టాపర్కు బంపర్ ఆఫర్

నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామాలలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పరీక్షలలో మొదటి స్థానాన్ని పొందిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి, రెండో స్థానం రూ.3 లక్షల నగదు, జిల్లా టాపరుకు రూ.2 లక్షలు, నియోజకవర్గస్థాయికి రూ.10 వేలు అందిస్తున్నామన్నారు.
News February 12, 2026
మెదక్: ఓటింగ్లో మహిళా చైతన్యం భేష్.. !

మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు మరోసారి ఓటింగ్లో సత్తా చాటారు. 4 మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా 80.76 శాతం ఓటింగ్ నమోదు చేసి చైతన్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 44,591 మంది మహిళా ఓటర్లలో 36,015 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని 4 ఛైర్మన్ స్థానాలు మహిళలకే రిజర్వ్ కావడంతో మహిళా ఓటర్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో రేపటి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


