News September 21, 2025

మెదక్: ‘జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు’

image

జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

Similar News

News September 21, 2025

మెదక్: ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టండి: పీడీ

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు మొదలుపెట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యం సూచించారు. జిల్లాలో 9,156 ఇళ్లు మంజూరు కాగా, 5,511 ఇళ్ల పనులు మొదలయ్యాయన్నారు. ఇందులో ఐదు పూర్తి కాగా బెస్మెంట్ లేవల్‌లో 2,408, లెంటల్ లేవల్‌లో 295, స్లాబ్ లేవల్‌లో 124 ఉన్నాయన్నారు. 2,832 ఇళ్లకు బిల్ జనరేట్ కాగా 2,500 మందికి బిల్లులు జమ అయ్యాయని వివరించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.

News September 21, 2025

మెదక్: రక్షణ జాగ్రత్తలు అవసరం: ఎస్పీ

image

దసరా పండగ పురస్కరించుకొని ఊర్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రజల భద్రత, ఆస్తి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంగారు నగలు, నగదు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరచడం మంచిదన్నారు. ఊర్లకు బయలుదేరే ముందు పక్కింటి, నమ్మదగిన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News September 20, 2025

మెదక్: మంత్రిని కలిసిన ఆరోగ్యశ్రీ ఆస్పత్రి ప్రతినిధులు

image

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని, ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని హాస్పిటల్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.