News March 8, 2025

మెదక్: డీఎడ్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

image

డిసెంబర్-2024లో జరిగిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందని, పాఠశాల విద్యాశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ ఫలితాల కొరకు https://bse.telangana.gov .in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్‌కు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News March 9, 2025

మెదక్: భర్త మృతి.. మూడు రోజులకు భార్య మృతి

image

చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మృతి చెందిన మూడు రోజులకే భార్య మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన చింతాకుల ఐలయ్య మూడు రోజుల క్రితం మరణించగామూడు రోజులకే ఇవాళ ఉదయం భార్య కొమురవ్వ అకస్మాత్తుగా మృతి చెందింది. భార్యాభర్తలు మూడు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో విషాదం నెలకొన్నది.

News March 9, 2025

మెదక్: విషాదం..  మామ, కోడళ్లు మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఒకేరోజు మామ కోడలు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మక్కరాజుపేట కు చెందిన ఆరేళ్ల సుమలత (35) వారం రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి మామ పోచయ్య (35) తీసుకువెళ్తున్నాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరగగా పోచయ్య గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న పోచయ్య ఈరోజు మృతిచెందగా, అస్వస్థతకు గురైన కోడలు సైతం మృతి చెందింది.

News March 9, 2025

మెదక్‌లో లోక్ అదాలత్.. 1500 కేసుల్లో రాజీ

image

మెదక్ జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద ఆధ్వర్యంలో 1500 కేసుల్లో రాజీ పడ్డారు. రూ.46 లక్షల 32వేల పరిహారం ఇప్పించారు. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, మొబైల్ కోర్టు జడ్జి సాయి ప్రభాకర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.

error: Content is protected !!