News March 4, 2025

మెదక్: తమ్ముడి దాడిలో అన్న మృతి

image

తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మాసాయిపేటకు చెందిన దుంపల రాజు, అతని తమ్ముడు చందు కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి గొడవపడ్డారు. ఈ గొడవలో తమ్ముడు అన్న రాజుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 5, 2026

తిమ్మాపురం బీచ్‌లో వృద్ధురాలి మృతి

image

తిమ్మాపురం బీచ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. 70 సంవత్సరాలు వయసున్న వృద్ధురాలు బీచ్ సమీపంలో రెండు రోజులుగా తిరుగుతూ ఉండగా స్థానికులు ఆహారం, దుప్పట్లు ఆమెకు ఇచ్చారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు గమనించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2026

తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్

image

SMలో గ్రోక్ AIతో మొదలైన <<18744158>>బికినీ ట్రెండ్<<>> భారతీయులను కంగారు పెట్టిన విషయం తెలిసిందే. నిండుగా దుస్తులున్న ఫొటోలనూ ఒక కమాండ్‌తో బికినీలోకి మార్చేస్తోంది. హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌కు బాధితులయ్యారు. కేంద్రం సీరియస్ అయ్యి ఆ కంటెంట్ తొలగించాలని ఆదేశించినా ఫలితంలేకుండా పోయింది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ తెలుగు స్టార్ హీరోలను తాకింది. ట్విటర్‌లో వారి ఫొటోలను కూడా కొందరు బికినీల్లోకి మారుస్తున్నారు.

News January 5, 2026

తిరుపతి: రూ.100కి రూ.40 వడ్డీ.. ప్రశ్నిస్తే హత్యాయత్నం.!

image

ఏర్పేడు మండలంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు హద్దు దాటుతున్నాయి. రూ.100కు రూ.20-40 వరకు వడ్డీ వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్నారట. అప్పు తీర్చకపోతే బైకులు, విలువైన సామగ్రి స్వాధీనం చేసుకుంటున్నారట. పోలీసులను ఆశ్రయిస్తే చంపేస్తామంటున్నారట. దీంతో బాధితులు బయటికి రాలేక అధిక వడ్డీలకు బలవుతున్నట్లు సమాచారం. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. మీ ఊరిలోనూ ఇలాగే ఉందా.?