News February 10, 2026

మెదక్: ‘తెరవెనుక రాజకీయం’ ఫలితాలను మారుస్తుందా..?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో రాజకీయం తెరవెనుకకు మళ్లింది. అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను ఆకర్షించేందుకు శక్తియుక్తులను వాడుతున్నారు. తమ ప్రత్యర్థుల ఓటు బ్యాంకుకు కన్నం వేసి ఆ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు ఓటరు తీర్పును ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈనెల 13న తేలనుంది.

Similar News

News April 5, 2026

దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు

image

*వివేక్ ఎక్స్‌ప్రెస్: దిబ్రూగఢ్ (అస్సాం) నుంచి కన్యాకుమారి. 4,154 కి.మీ 75 గంటల్లో ప్రయాణిస్తుంది
*అరోనై ఎక్స్‌ప్రెస్: సిల్చార్ (అస్సాం) నుంచి తిరువనంతపురం. 3,916 కి.మీ.
*హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్: కన్యాకుమారి నుంచి కత్రా(J&K). 3,789 కి.మీ.
*తిరునెల్వేలి జమ్మూ ఎక్స్‌ప్రెస్: తిరునెల్వేలి (TN) నుంచి కత్రా. 3,642 కి.మీ.
*న్యూ టిన్సుకియా: న్యూ టిన్సుకియా (అస్సాం) నుంచి బెంగళూరు. 3,642 కి.మీ.

News April 5, 2026

NLR: ‘ఫేస్ వాష్ అండ్ గో’తో ప్రమాదాలకు చెక్

image

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.

News April 5, 2026

బాపట్ల కలెక్టరేట్‌లో డా.బాబూ జగజ్జీవన్ రామ్‌కు నివాళులు

image

బాపట్ల కలెక్టరేట్‌లో ఆదివారం డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తదితర అధికారులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.