News September 2, 2025
మెదక్: ‘నష్టం అంచనాలను వెంటనే అందజేయాలి’

భారీ వర్షాలు, వరద సహాయం పై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్ వీసీలో పాల్గొన్నారు. వరద నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, నష్టం అంచనాలను అధికారులు త్వరిత గతిన అందజేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.
Similar News
News September 2, 2025
మెదక్: డీవైఎస్ఓ దామోదర్ రెడ్డి బదిలీ.. డీఈఓకే బాధ్యత

మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. గతేడాది జులైలో బదిలీపై రాగా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. దామోదర్ రెడ్డి బదిలీ కాగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్కు డీవైఎస్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జ్ మెదక్ డీఈఓగా ఉన్న ప్రొ.రాధాకిషన్ కు డైట్ ప్రిన్సిపల్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. తాజాగా డీవైఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.
News September 2, 2025
MDK: ‘స్థానిక ఎన్నికలు.. గ్రామాల్లో ముచ్చట్లు’

ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించేదుకు ముందుకు వెళ్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తుది జాబితా విడుదల చేసింది. 9న అభ్యంతరాల స్వీకారణ, 10న తుది జాబితా తర్వాత సర్పచ్ ఎన్నికలు నిర్వహించనుంది. జిల్లా వ్యాప్తంగా 21 మండలలు, 492 గ్రామ పంచాయతీలు, 5,23,327 ఓటర్లు, 190 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీలు, బూత్లు 1052 ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూపిన ఎన్నికలపై ముచ్చటిస్తున్నారు.
News September 2, 2025
MDK: CEIR ద్వారా 1264 ఫోన్లు స్వాధీనం: ఎస్పీ

CEIR పోర్టల్ ద్వారా రూ.25 లక్షల విలువగల 167 మొబైల్ ఫోన్లు రికవరి చేసి బాధితులకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అందజేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.89 కోట్ల విలువ గల మొత్తం 1264 ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఫోన్లు తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.