News January 28, 2026
మెదక్: నేతల సర్వేలు.. ఆశావహుల ఆఫర్లు

ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి నామినేషన్ల షురూ కావడంతో కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావహులు ప్రధాన పార్టీల నేతల వద్ద పైరవీలు చేస్తున్నారు.”నాకు టికెట్ ఇస్తే గెలుపు పక్కా” అంటూ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక కోసం సర్వే నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో ఆశావహులు, నేతల్లో టెన్షన్ మొదలైంది.
Similar News
News February 10, 2026
బాబ్రీ మసీదు నిర్మాణం జరగదు: UP CM యోగి

బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పటికీ జరగదని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘రామ్ లల్లా కోసం వస్తామని, ఆలయం నిర్మిస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఖయామత్ దినం రాదనేది నిజం. అలాంటప్పుడు బాబ్రీ నిర్మాణం ఎలా జరుగుతుంది? దాని గురించి కలలు కనొద్దు’ అని బారాబంకి సభలో అన్నారు. WB ముర్షిదాబాద్లో బాబ్రీ తరహా మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ లక్నో నుంచి మార్చ్ చేయనున్నట్టు హిందూ సంస్థలు ప్రకటించాయి.
News February 10, 2026
కృష్ణా జిల్లాలో శివరాత్రికి భారీ బందోబస్తు – ఎస్పీ విద్యాసాగర్

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు మంగళవారం తెలిపారు. ప్రధానంగా 7 క్షేత్రాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, సీసీ, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో పాటు మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు తోపులాట లేకుండా క్యూలైన్లలో క్రమశిక్షణతో దర్శించుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
News February 10, 2026
వాస్తుకు లేని స్థలాల్లో ఇల్లు కట్టుకోవచ్చా ?

వాస్తు లేని స్థలంలో ఇల్లు కట్టాల్సి వస్తే, రోడ్డును బట్టి సరైన ప్లాన్ రూపొందించుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇంటి చుట్టూ 4 వైపులా ఖాళీ స్థలం వదలాలి. గాలి, వెలుతురు ప్రతి గదిలోకి ప్రవహించేలా చూసుకోవాలి. నీటి వసతికి ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా నిర్మించుకోవాలి. వీటితో ఇంటికి జీవశక్తి పెరుగుతుంది. ఆందోళన అనవసరం. ప్రాథమిక సూత్రాలు పాటించడమే అసలైన వాస్తు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


