News December 25, 2025
మెదక్: పేదల దేవుళ్లకు 6దశాబ్దాలుగా పూజలు

కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అకాల మరణం పొందిన కామ్రెడ్ కేవల్ కిషన్, లక్ష్మయ్యలు పేదల దేవుళ్లయ్యారు. పీడితుల విముక్తి నుంచి పోరాడి కూరుకుపోయిన భూస్వామ్యాన్ని కూల్చి సమాజ సమానత్వానికై పోరాడారు. కేవల్ కిషన్, ఆయన మిత్రుడు లక్ష్మయ్య ప్రమాదంలో మరణించి ఆరు దశాబ్దాలు గడిచింది. చేగుంట మండలం పొలంపల్లిలో గుడి కట్టి ఆరాధిస్తున్నారు. వారి వర్దంతి సందర్బంగా రేపు జాతర జరగనుంది.
Similar News
News December 25, 2025
ప్రకాశం జిల్లా మెప్మా పీడీపై చర్యలు

ప్రకాశం మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాపట్ల పీడీని నియమించారు. దాదాపు రూ.10 కోట్లు బోగస్ సంఘాలకు రుణాలుగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మెప్మాలో అవినీతి జరిగిందంటూ గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు విచారణ సైతం సాగుతోంది. విచారణ పర్వంలోనే పీడీని సరెండర్ చేయడం విశేషం.
News December 25, 2025
స్వయంకృషి: MILK.. మిడిల్ క్లాస్ సిల్క్!

ప్రతి ఇంటికీ పొద్దున్నే కావాల్సిన పాలు ఇప్పుడు కల్తీ లేదా ప్యాకెట్ మయంగా మారాయి. ప్రజలు వీటితో నష్టం గ్రహించి తిరిగి లోకల్ సెల్లర్స్, మిల్క్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రైతులకు టైమ్కు, తగిన ధర చెల్లిస్తే నాణ్యమైన పాలు పొందడం కష్టమేం కాదు. నమ్మకం, నాణ్యత మెయింటైన్ చేస్తే రోజూ పట్టణాలు, నగరాల్లో ₹వేల ఆదాయం. మిగిలితే అనే భయం లేకుండా పెరుగు, నెయ్యి లాంటి ఆప్షన్స్ ఉంటాయి.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా
News December 25, 2025
హిందూత్వం ఓ మహోన్నత మార్గం

హిందూ అనేది కేవలం మతం కాదు. ఇదో ‘జీవన విధానం’. మతం అనేది నిర్దిష్ట ప్రవక్త, గ్రంథానికి కట్టుబడి ఉంటుంది. కానీ హిందూ ధర్మంలో అనేక మార్గాలు, గ్రంథాలు, దైవ రూపాలు ఉన్నాయి. ఇది మనిషి తన బాధ్యతలను (ధర్మాన్ని) ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. సత్యం, అహింస, ప్రాణి కోటి పట్ల దయ చూపడం వంటి విశ్వవ్యాప్త సూత్రాలే దీని పునాది. అందుకే హిందుత్వాన్ని క్రమశిక్షణతో కూడిన ‘ధర్మం’ అని కొలుస్తుంటారు.


