News March 18, 2024

మెదక్: ప్రజావాణిలో 73 వినతులు

image

సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 73 ఆర్జీలు వచ్చినట్టు వివరించారు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలన్నారు. కానీ ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు.

Similar News

News September 3, 2025

టేక్మాల్: గణపతి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు

image

టేక్మాల్‌లో గణపతి లడ్డూను ముస్లిం యువకుడు మతీన్ దక్కించుకున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టేక్మాల్‌లోని నాగులమ్మ ఆలయం వద్ద గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో గ్రామానికి చెందిన మతీన్ రూ. 21 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు అతనికి ఈ ఘటన మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.

News September 3, 2025

మెదక్ జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు

image

తుది ఓటరు జాబితా ప్రకారం మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,23,327 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 2,51,532 మంది, మహిళలు 2,71,787 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు.

News September 3, 2025

MDK: అత్తింటి వేధింపులతో నవ వధువు సూసైడ్

image

చిన్నశంకరంపేటకు చెందిన రాధిక(19)కు నెల రోజుల క్రితం ఇంటి పక్కనే ఉన్న వానరాసి కుమార్(22)తో పెళ్లి అయింది. కాగా, అత్తింటి వేధింపులు భరించలేక<<17595482>> నవ వధువు రాధిక<<>> ఊరేసుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. అయితే రాధిక తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. తల్లి, అన్న, చెల్లెలు గత ఏడాది చనిపోయారు. ప్రస్తుతం 15 ఏళ్ల తమ్ముడు, ఇద్దరు అక్కలు ఉండగా.. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.