News March 17, 2025

మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.

Similar News

News July 7, 2025

మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 61 దరఖాస్తులు

image

ప్రజావాణి కార్యక్రమానికి 61 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం తెలిపారు. మెదక్‌లో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు-29, పింఛన్లు-4, ఇందిరమ్మ ఇళ్లు-7, ఇతర సమస్యలకు సంబంధించి 21 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2025

మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News July 7, 2025

తూప్రాన్: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు గురుకుల విద్యార్థులు

image

తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తారా సింగ్ తెలిపారు. గురుకుల కళాశాల విద్యార్థులు రాకేశ్, విష్ణు శ్రీ చరణ్ ఇరువురు డెహ్రాడూన్‌లో ఈ నెల 12 నుంచి జరిగే రగ్బీ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రిన్సిపల్‌తో పాటు వైస్ ప్రిన్సిపల్ సుహాసిని, పీఈటీ రమేశ్, పీడీ నవీన్ విద్యార్థులను అభినందించారు.