News March 5, 2025
మెదక్: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్పై నిషేధం

మెదక్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ రక్షణ చట్టం 1986 లోని సెక్షన్ 5 కింద ఆదేశాలు జారీ చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కావున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మంచినీరు తాగేందుకు స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ఉపయోగించాలని సూచించారు.
Similar News
News April 21, 2025
మెదక్: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం సంబంధిత కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో తెలపాలని ఎస్పీ సూచించారు.
News April 21, 2025
BREAKING: తూప్రాన్: ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి

మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5)తో హల్దీ వాగులో దూకింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు లాగగా పిల్లలు గల్లంతయ్యారు. మమత భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
BREAKING: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కారులో చిన్నారులతో సహా 9 మంది ఉండగా ఏడాది బాబు గౌస్, ఆలీ (45), అజీం బేగం(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.