News March 5, 2025
మెదక్: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్పై నిషేధం

మెదక్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ రక్షణ చట్టం 1986 లోని సెక్షన్ 5 కింద ఆదేశాలు జారీ చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కావున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మంచినీరు తాగేందుకు స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ఉపయోగించాలని సూచించారు.
Similar News
News January 28, 2026
మెదక్: ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలి

ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, జాతర పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News January 28, 2026
నర్సాపూర్: బాడీ బిల్డింగ్లో అదరగొట్టిన GOVT టీచర్

నర్సాపూర్కు చెందిన GOVT టీచర్ఎ ల్. శ్రీనివాస్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల HYD ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆయన తెలంగాణ ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు ఢిల్లీలో జరగనున్న నేషనల్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో పాల్గొననున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం చిలప్చెడ్ మండలం గౌతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు.
News January 28, 2026
రామాయంపేట: ఎన్నికల ముందే హామీల అమలు!

రామాయంపేట మున్సిపాలిటీలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను ముందే అమలు చేస్తూ పలు వార్డుల్లో మినీ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాలను వివరిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.


