News July 29, 2024

మెదక్: ఫైనాన్స్ రుణం ఇస్తామని.. డబ్బులు కాజేశారు

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామానికి చెందిన రావెల్లి నరసింహులుకు ఓ ఫైనాన్స్ నుంచి రుణం ఇస్తామని ఫోన్ చేసి రూ. 42,500 కాజేశారు. మీ సిబిల్ స్కోర్ బాగుందని రుణమిస్తామని ఫోన్ చేశారు. వారి మాటలు నమ్మి ఇన్సూరెన్స్ కోసం, డాక్యుమెంట్లు, ఆర్బీఐ అనుమతి కోసం అంటూ పలు దఫాలుగా డబ్బులు పంపారు. రుణం చెల్లించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News August 8, 2025

మెదక్: ‘పునరావాసంపై భరోసా మరింత దృష్టి పెట్టాలి’

image

పునరావాసంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ భరోసా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మెదక్ భరోసా సెంటర్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కేక్ కట్ చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి తదితరులు హాజరయ్యారు. పిల్లలపై లైంగిక దాడుల నివారణ, బాధితుల పునరావాసంపై విలువైన చర్చించారు.

News August 6, 2025

స్వాతంత్య్ర దినోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు: కలెక్టర్

image

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్
రాహుల్ రాజ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్ కార్యాలయంలో యధావిథిగా జెండా వందనం ఉంటుందని, ముఖ్యమైన కార్యక్రమం పరేడ్ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ, ముఖ్య అతిథి సందేశం ఉంటుందన్నారు. అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు ఉన్నారు.

News August 6, 2025

రెవెన్యూ సదస్సు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి: RDO

image

రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం మెదక్ ఆర్టీవో రమాదేవి ఆకస్మికంగా సందర్శించారు. భూభారతి రెవిన్యూ సదస్సులో రైతులు అందజేసిన ఫిర్యాదులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో అందించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రజనీకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.