News February 1, 2026
మెదక్: మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్: ఎస్పీ

మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్కు పాల్పడిన వారిపై 6 ఎఫ్ఐఆర్లు, 12 ఈ–పెట్టీ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రెడ్ హ్యాండెడ్గా తూప్రాన్ సబ్ డివిజన్లో 39 మంది, మెదక్ సబ్ డివిజన్లో 65 మంది, మొత్తం 104 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.
Similar News
News February 20, 2026
ఎడ్యుకేషనల్ హబ్గా సిద్దిపేట అభివృద్ధి: హరీశ్ రావు

సిద్దిపేటను మెడికల్, పారామెడికల్ కాలేజీలు, ఐటీ టవర్తో అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దామని MLA హరీశ్ రావు తెలిపారు. ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ ద్వారా ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, మొబైల్ వ్యసనాలకు దూరంగా కష్టపడి చదివితే పేదరికం అడ్డుకాదని సూచించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
News February 20, 2026
మెదక్: 22న బేస్ లైన్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు బేస్ లైన్ పరీక్షలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అభ్యాసకులు తప్పకుండ పరీక్షలకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలకు ఎస్.వెంకటస్వామి కో ఆర్డినేటర్ 8008403635 ఫోన్ చేయాలని సూచించారు.
News February 19, 2026
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రత్యేక ప్రచార వాహనాన్ని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.


