News April 22, 2025

మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

image

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 24, 2026

IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>IOCL <<>>దిగ్బోయ్ రిఫైనరీలో 48 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BSc, డిప్లొమా అర్హత గలవారు NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేసి ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరి 28న అభ్యర్థులను ప్రకటిస్తారు. వెబ్‌సైట్: https://iocl.com

News February 24, 2026

రామప్ప టెంపుల్ WONDERFUL: ఫ్రాన్స్ దేశస్థులు

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలోగల కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని ఫ్రాన్స్ దేశస్థులు అన్నారు. మంగళవారం ఆలయంలో రామలింగేశ్వర స్వామికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉమాశంకర్, హరీశ్ శర్మ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ గైడ్ తాడే బోయిన వెంకటేశ్ ద్వారా ఆలయ చరిత్ర, శిల్ప సంపద గురించి తెలుసుకున్నారు. వారివెంట టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, అరుణ్ కుమార్, భద్రు ఉన్నారు.

News February 24, 2026

రాష్ట్రంలో రూ.549కోట్ల మోసం.. ఏం జరిగిందంటే?

image

TG: ఖమ్మంలో రూ.500కోట్ల సైబర్ స్కామ్ సంచలనంగా మారింది. సత్తుపల్లికి చెందిన వికాస్ చౌదరి, మరికొందరు ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్‌తో కలిసి రూ.549కోట్లకు పైగా కొల్లగొట్టారు. షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్, బెట్టింగ్, గేమింగ్, క్రిప్టో కరెన్సీ పేరిట అమాయకులను మోసం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి పోలీసులు ఇప్పటికే 18 మందిని రిమాండ్‌కు పంపగా, కీలక నిందితుడు వికాస్ తాజాగా లొంగిపోయినట్లు తెలుస్తోంది.