News February 19, 2025
మెదక్: యూనివర్సిటీ కోసం భూమి పరిశీలించిన కలెక్టర్

మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమిని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం పాపన్న పేట మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమికి సంబంధించి వివిధ ప్రదేశాలను సంబంధిత ఆర్డీవో రమాదేవి, ఇన్ ఛార్జ్ తహశీల్దార్ మహేందర్ గౌడ్తో కలిసి పరిశీలించారు.
Similar News
News February 20, 2025
మెదక్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు

మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ (రెగ్యులర్) చేయాలన్న పిలుపుతో ఆర్టిజన్ ఉద్యోగులు చలో హైదరాబాద్ విద్యుత్ సౌదాకు పిలుపునిచ్చారు. యూనియన్ నాయకుల పిలుపుమేరకు చలో విద్యుత్ సౌదా వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
News February 20, 2025
సంగారెడ్డి: కల్లు కోసం వచ్చి స్నేహితులు మృతి

జిన్నారం PS పరిధిలో<<15514933>> చెరువులో మునిగి<<>> ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల వివరాలిలా.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్కు చెందిన స్నేహితులిద్దరూ నరేష్, శంకర్ మంగళవారం సాయంత్రం వావిలాలలో కల్లు తాగేందుకు బైక్ పై వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో ఈత కొట్టేందుకు పీర్ష చెరువులోకి దిగి మునిగిపోయారు. ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహాలు నిన్న దొరికాయి. స్నేహితులిద్దురి మృతి గ్రామంలో విషాదం నింపింది.
News February 20, 2025
సంగారెడ్డి: వర్సిటీ ప్రొఫెసర్ ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా కంకోల్లోని వోక్స్ వ్యాగన్ వర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనర్ ప్రొఫెసర్ సుమంత్ కుమార్(36) సూసైడ్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 12 అయినా సుమంత్ క్లాస్కు రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న మునిపల్లి SI రాజేశ్ నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని సదాశివపేట ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఝర్ఖండ్లో సుమంత్ ఫ్యామిలీకి సమాచారం ఇచ్చారు.