News March 23, 2025

మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

image

అప్పుల బాధతో రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల(50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 24, 2025

MDK: ఆశా వ‌ర్క‌ర్ల‌ను విడుద‌ల చేయాలని హ‌రీశ్‌రావు డిమాండ్

image

రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా?, వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గం అని మండిప‌డ్డారు.

News March 24, 2025

మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు…!

image

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. హవేలిఘనపూర్, రేగోడ్ 36.6, అల్లాదుర్గ్ 36.5, పాపన్నపేట్ 36.4, కౌడిపల్లి, టేక్మాల్ 36.0, పెద్దశంకరంపేట్ 35.9, మెదక్ 35.8, నర్సాపూర్, వెల్దుర్తి 35.3, కుల్చారం 34.8, శివ్వంపేట, మనోహరాబాద్ 34.7°C జిల్లాలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్దులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

News March 24, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ వార్

image

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, BRS పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కాయి. గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి రాజ్‌భవన్‌కు పాదయాత చేపట్టగా.. BRS మాజీ MLA ‘ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోస’తో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. గజ్వేల్ MLA క్యాంపు ఆఫీస్‌కు బీజేపీ నేతలు TOLET బోర్డు పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీ కావాలనే కుట్రలో భాగంగా కేసీఆర్‌ను భద్నం చేయాలని చూస్తున్నాయని BRS శ్రేణులు మండిపడుతున్నారు. మరి మీ కామెంట్..

error: Content is protected !!