News February 19, 2025
మెదక్: వైద్యం చేయించలేక భర్తను చంపేసింది

భర్తను అల్లుడితో కలిసి భార్య హత్యచేసింది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా పాపన్నపేట మం. బాచారం వాసి ఆశయ్య(45) ఈనెల 15న పొలంలో పనిచేస్తూ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి వెళ్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేశ్ కలిసి ఆదివారం అర్ధరాత్రి హత్య చేసింది. సహజమరణంగా నమ్మించే ప్రయత్నించగా మెడపై గాయలు చూసిన మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News September 15, 2025
విశాఖ పీజీఆర్ఎస్కు 329 వినతులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారి భవానీ శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ప్రజలు వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 329 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 92, జీవీఎంసీకి చెందినవి 88, పోలీసు శాఖకు సంబంధించి 25, ఇతర శాఖలకు సంబంధించి 124 ఉన్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేషశైలజ ఉన్నారు.
News September 15, 2025
బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ కమిటీలో జహీరాబాద్ ఎంపీ కుమార్తె

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మీడియా, పబ్లిసిటీ ఛైర్మన్ పవన్ ఖేరా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించారు. బెంగాల్ ఎన్నికల కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కుమార్తె గిరిజా షెట్కార్(పరిశోధన)ను పశ్చిమ బెంగాల్ మీడియా కోఆర్డినేటర్ కేటాయించారు.
News September 15, 2025
అక్టోబర్ 4న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం: కలెక్టర్

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం అక్టోబర్ 4న ఉదయం 10:30కు జరుగుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. MHBD పట్టణం కొత్త బజార్లోని లయన్స్ భవన్లో సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాకు సంబంధించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం హాజరై ఎజెండాలోని పలు అంశాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.