News April 11, 2024
మెదక్: శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ టేక్మాల్ మండలం దన్నూరా, బర్దిపూర్, పాల్వంచ, కూసంగి, మల్కాపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దుబ్బగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 27, 2026
MDK: అధికారులందరూ సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 75 వార్డులుండగా
150 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. నామినేషన్ పక్రియ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండి, ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.
News January 27, 2026
మెదక్: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్ ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.
News January 27, 2026
మెదక్: 4 మున్సిపాలిటీలు.. 87,615 మంది ఓటర్లు

మున్సిపల్ <<18974641>>ఎన్నికల నగారా<<>> మోగింది. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 87,615 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్-32 వార్డులు, 37,016 ఓటర్లు, రామాయంపేట-12 వార్డులు, 13,106 ఓటర్లు, నర్సాపూర్-15 వార్డులు, 17,066 ఓటర్లు, తుప్రాన్-16 వార్డులు 20,427 మంది ఓటర్లు ఉన్నారు. కాగా FEB 11న పోలింగ్, 13న ఫలితాలు.


