News March 26, 2024
మెదక్: షాంపూ కోసం తల్లిని చంపాడు

షాంపూ కోసం కన్నతల్లిని ఇటుకతో కొట్టి హత్య చేసిన సంఘటన మెదక్ మండలం రాజ్పల్లిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవమ్మ(58)తో తన కుమరుడు నారాయణ షాంపూ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో తల్లిని ఇటుకతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 7, 2025
మెదక్: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

మెదక్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రూ.5 కోట్ల వ్యయంతో ఇందిర మహిళా శక్తి భవనాన్ని నిర్మించుకుంటున్నామని, పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని తెలిపారు. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా పనులలో వేగం పెంచాలని పంచాయతీరాజ్ ఇంజినీర్ను ఆదేశించినట్లు తెలిపారు.
News September 7, 2025
MDK: పాముకాటుకు రైతు మృతి

ఎల్దుర్తి మండలంలోని శేరిల్ల గ్రామానికి చెందిన ఆగమయ్య (50) అనే రైతు పాముకాటుకు గురై మృతి చెందాడు. వ్యవసాయంతో పాటు పశుపోషణతో కుటుంబాన్ని పోషించుకునే ఆగమయ్య, తన గేదెలను మేతకు తీసుకెళ్లగా కాలికి విషసర్పం కాటువేసింది. నోటి నుంచి నురగలు కక్కుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఎల్దుర్తిలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 7, 2025
మెదక్: 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ

భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే పునరుద్ధరించినట్లు టీజీఎస్సీపీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. మెదక్లోని ఎస్ఈ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 115 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన చెప్పారు.