News February 2, 2025
మెదక్: BRS శ్రేణుల్లో పుల్ జోష్.. నింపిన KCR ప్రసంగం

జహీరాబాద్ నియోజక వర్గం నుంచి రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలు కార్యకర్తలలో జోష్ను నింపాయి. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయా ప్రాజెక్టులను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అవసరమైతే ఉద్యమించి పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యమంలో తాను ముందుండి నడిపిస్తానన్నారు.
Similar News
News February 26, 2026
పార్వతీపురం: డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం

జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలని తెలిపారు. బస్సులు, రైల్వే స్టేషన్లలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేయాలని సూచించారు.
News February 26, 2026
బొప్పాపూర్: ‘పనులు వేగవంతంగా పూర్తి చేయాలి’

పీఎంశ్రీ కింద ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్ లో అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత విద్యాలయంలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించారు.
News February 26, 2026
DGCA కొత్త రూల్స్.. 48 గంటల్లోగా..!

విమాన టికెట్ల రిఫండ్ రూల్స్లో DGCA సవరణలు చేసింది. టికెట్ కొన్న 48 గంటల్లోగా క్యాన్సిల్/మార్పులు చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు కట్టక్కర్లేదని చెప్పింది. అలాగే టికెట్లు క్యాన్సిలేషన్ డబ్బులను 14 రోజుల్లో రిఫండ్ చేయాలంది. అటు టికెట్లు బుక్ చేసుకున్న 24గంటల్లో పేర్లలో కరెక్షన్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజ్ తీసుకోవద్దని ఎయిర్లైన్స్ను ఆదేశించింది. అనారోగ్య కారణాలతో కాన్సిల్ చేసుకున్నా ఇవి వర్తిస్తాయంది.


