News June 6, 2024

మెరకముడిదాంలో బొత్సకు భారీగా తగ్గిన ఓట్లు

image

చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో గతంలో బొత్సకు 9 వేల ఆధిక్యత రాగా.. ఈసారి కళాకు 607 మెజార్టీ వచ్చింది. గతంలో బొత్సకు ఆరు వేల మెజార్టీ వచ్చిన గరివిడి మండలంలో ఈసారి కళా వెంకట్రావు 4,225 ఓట్ల ఆధిక్యత సాధించారు. చీపురుపల్లి గతంలో బొత్సకు 4వేల ఆధిక్యత రాగా.. ఈసారి టీడీపీకి 4,315 మెజార్టీ వచ్చింది. గుర్లలో గతంలో బొత్సకు 5,900 ఆధిక్యత సాధించగా.. ఈసారి టీడీపీకి 2,492 ఓట్ల మెజార్టీ వచ్చింది.

Similar News

News April 24, 2025

బాలికను రక్షించిన కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం

image

విజయనగరం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. టూ టౌన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి 17 ఏళ్ల అమ్మాయిని రక్షించారు. దీంతో ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ని బుధవారం అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.

News April 23, 2025

10th RESULTS: ఏడో స్థానంలో విజయనగరం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 22,777 మంది పరీక్ష రాయగా 19,824 మంది పాసయ్యారు. 11,413 మంది బాలురులో 9.748(85.41%) మంది, 11,364 మంది బాలికలు పరీక్ష రాయగా 10,076(88.67%) మంది పాసయ్యారు. 87.04% పాస్ పర్సంటైల్‌తో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.

News April 23, 2025

VZM: ఆ పాఠశాల ఫలితాల కోసం ఎదురుచూపు

image

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు బాగా చదవడం లేదని పరీక్షలకు నెల రోజుల ముందు హెచ్ఎం రమణ విద్యార్థుల ముందు గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తామని, ట్రిపుల్ ఐటి సీట్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

error: Content is protected !!