News March 9, 2025
మేజర్ సిటీగా ఏలూరును అభివృద్ధి చేస్తాం: ఎంపీ

ఏలూరు నగరాన్ని మేజర్ సిటీగా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎంపీ మహేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజధాని అమరావతి అభివృద్ధితో ఏలూరు సిటీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఎంపీ పేర్కొన్నారు.
Similar News
News March 9, 2025
సూర్యాపేట: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్కు మిర్యాలగూడ, హుజూర్నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
News March 9, 2025
నల్గొండ: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్కు మిర్యాలగూడ, హుజూర్నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
News March 9, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య CT ఫైనల్ జరుగుతోంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ గెలిచిన టీంకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు లభిస్తాయి. టోర్నీలో పాల్గొన్నందుకు IND, NZ సహా అన్ని టీంలు $125,000, గ్రూప్ స్టేజ్లో గెలిచిన టీంలు 34,000 డాలర్లు అందుకుంటాయి. 5, 6 స్థానాల్లో నిలిచిన జట్లకు $350,000, 7,8 స్థానాల్లో నిలిచిన జట్లకు $140,000 లభిస్తాయి.