News June 30, 2024
మేడారంలో భక్తుల సందడి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం ( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Similar News
News September 21, 2024
BREAKING.. జనగామ: తల్లిని చంపిన కుమారుడు
జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండలో కుమారుడు తల్లిని చంపాడు. స్థానికుల ప్రకారం.. కుమారుడు సత్తయ్య తల్లి సముద్రాల లక్ష్మమ్మ(65)ను రోకలిబండతో కొట్టి చంపాడు. అయితే సత్తయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం లేనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 21, 2024
జనగామ: కుటుంబ కలహాలతో తల్లీ, కూతురు ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కూతురితో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ CI శ్రీను, SI కృష్ణారెడ్డి వివరాలు.. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన రాజేశ్వర్, శారద ఉపాధికోసం బెజ్జంకి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త.. తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో మనస్తాపానికి గురైన శారద కూతురితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
News September 21, 2024
క్యాబినెట్కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ములుగు మెడికల్ కాలేజీకి పోస్టులు మంజూరుకు క్యాబినెట్ సంపూర్ణ ఆమోదం తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవడం వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.