News January 4, 2026
మేడారం జాతర.. టోల్ ‘ఫ్రీ’ పరిశీలిస్తున్నామన్న కోమటిరెడ్డి

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఊరటనిచ్చేలా టోల్ ఫీజు మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ‘సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వారికే కాదు, తెలంగాణ గడ్డపై జరిగే అతిపెద్ద జాతర మేడారానికి వెళ్లే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News February 9, 2026
‘SIR’కు అడ్డంకులు సృష్టించొద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక

‘SIR’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ WB ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సర్’ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించొద్దని హెచ్చరించింది. మరోవైపు 300 మంది అధికారులను కోరితే ప్రభుత్వం 80 మందిని మాత్రమే ఇచ్చిందని EC కోర్టుకు తెలిపింది. స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. దీంతో గడువును వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు SC తెలిపింది.
News February 9, 2026
పాక్ గొంతెమ్మ కోర్కెలు.. కుదరదన్న ICC!

T20WC: ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ICCకి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ‘భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్, IND-PAK-BAN మధ్య ట్రై సిరీస్, భారత్ వచ్చే ఏడాది బంగ్లాలో పర్యటించాలి’ అని కోరినట్లు సమాచారం. పాక్ గొంతెమ్మ కోర్కెలను ICC తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘అది మా పరిధి కాదు’ అని ICC సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
News February 9, 2026
కోలుకుంటున్న శరద్ పవార్

తీవ్ర అస్వస్థతకు గురైన NCP చీఫ్ శరద్ పవార్ కోలుకుంటున్నారని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయనను ఇవాళ మధ్యాహ్నం పుణేలోని రుబీహాల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు 5 రోజుల యాంటీబయాటిక్స్ కోర్స్ సజెస్ట్ చేసినట్లు సుప్రియ వెల్లడించారు. ఇటీవల శరద్ పవార్ సోదరుడి కుమారుడు, MH Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.


