News January 11, 2026

మేడారం: టూర్లతో పనులకు బ్రేకులు!

image

అసలే మేడారం జాతరకు టైమ్ లేదు. మరోపక్క ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే 7 సార్లు వచ్చిన మంత్రి పొంగులేటి, ఆదివారం మరోసారి వస్తున్నారు. ఆయనతో పాటుగా నలుగురు మంత్రులు వస్తుండటంతో జాతర పనులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. అసలే సమయం లేకపోగా, మంత్రుల వరుస పర్యటనతో 3 నుంచి 4 గంటల పాటు పనులు నిలిచిపోతున్నాయి. మరోపక్క భక్తులు సైతం పోటెత్తుండటంతో ఈ పనులు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

Similar News

News February 21, 2026

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల: DEO

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) సెకండరీ, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసినట్లు NTR జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ తెలిపారు. అభ్యర్థులు తమ మొబైల్ ద్వారా 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపి, అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో OTP ధృవీకరణ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు.

News February 21, 2026

బడ్డీ వద్ద బజ్జీలు వేసిన హోంమంత్రి అనిత

image

ఉపమాకలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను హోంమంత్రి అనిత శనివారం పరిశీలించారు. ఆసమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను మంత్రికి తీసుకువచ్చి అందజేశారు. వాటిని రుచి చూసిన మంత్రి స్వయంగా షాప్ వద్దకు వెళ్లి కొద్దిసేపు బజ్జీలు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

News February 21, 2026

చీపురు పట్టిన నంద్యాల కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని గుర్తు చేయాల్సిన అవసరం ఉందని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శుభ్రత పనులను పరిశీలించారు. అనంతరం చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. జీవిత విధానంలో శుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు.