News December 26, 2025

మేడారం మహా జాతరకు జంపన్నవాగు సిద్ధం..!

image

మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం జంపన్న వాగులో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవతల దర్శనానికి ముందు భక్తులు వాగులో పవిత్ర స్నానాలు చేయనున్నారు. ఇందుకోసం రూ.5.50 కోట్లతో ఇసుకను చదును చేసి, 39 బావులను శుభ్రపరిచి పైపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నెల 25 నాటికి పనులు పూర్తి చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Similar News

News December 31, 2025

మేడిపల్లి: దొరికిన దొంగలు.. సొత్తు స్వాధీనం

image

మేడిపల్లి పరిధిలో ఈనెల 24న అర్ధరాత్రి మహాలక్ష్మి మొబైల్ షాప్‌లో 9 సెల్‌ఫోన్లు, 27న అర్ధరాత్రి కోరుట్ల పట్టణంలోని హాజీపూర్‌లో మోటార్‌ సైకిల్ చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పడాల దినేశ్, అర్షద్ ఖాన్, పిట్టల అరవింద్, జగదీశ్వర్‌లను మేడిపల్లి శివారులో పట్టుకుని వారి వద్ద నుంచి 9 సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.

News December 31, 2025

‘యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి’

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, జులై 2026 నాటికి ఆర్.ఓ.బీ పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులను రైల్వే శాఖ పూర్తి చేయాలన్నారు. మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తవ్వాలన్నారు.

News December 31, 2025

తూ.గో.లో ‘మత్తు’ రికార్డు.. డిసెంబర్‌లోనే 100 కోట్లు హాంఫట్!

image

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు అధికార గణాంకాలు తెలిపాయి. కొత్త ఏడాది వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ రూ.25 కోట్ల విలువైన 1.60 లక్షల కేసుల మద్యాన్ని సిద్ధం చేసింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.