News December 11, 2025
మేడారం సర్పంచ్గా భారతి

తాడ్వాయి మండలంలో గురువారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. మండలంలోని మేడారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పీరీల భారతి-వెంకన్న గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి భారతి గెలుపుతో మేడారంలో నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి విజయోత్సవ సంబరాలను జరుపుకుంటున్నారు.
Similar News
News December 14, 2025
అనంత జిల్లాలో రెండు బస్సులు ఢీ

గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని బస్సు డ్రైవర్ ఓవర్టేక్ చేయబోయాడు. ఆ సమయంలో వెనక నుంచి మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. బస్సులు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 14, 2025
ఏలూరు: 1,127 మంది డుమ్మా..!

నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలను ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం 11 కేంద్రాల్లో నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. 2,311 మంది హాజరు కావలసి ఉండగా 1,184 మంది హాజరయ్యారన్నారు. 1,127 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి 2, పెదవేగి నవోదయ వైస్ ప్రిన్సిపల్ 1, అసిస్టెంట్ కమిషనర్ 4 పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు.
News December 14, 2025
మెదక్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. చిన్నశంకరంపేటలో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి, వృద్ధురాలికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా సహాయం అందించారు.


