News October 12, 2025
మేడారానికి పొంగులేటి.. నెలకొన్న ఆసక్తి!

మేడారం ఆలయ ప్రాంగణం ఆధునీకరణ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని CM రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతర పనులపై సమీక్ష జరిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం మేడారం రానున్నారు. అయితే, తాజాగా మంత్రి కొండా సురేఖ తన శాఖలో పొంగులేటి పెత్తనం చేస్తున్నారంటూ అధిష్ఠానంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పొంగులేటి రాకపై ఆసక్తి నెలకొంది. కాగా, 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది.
Similar News
News October 12, 2025
మా పార్టీ వాళ్లనూ సస్పెండ్ చేశాం: చంద్రబాబు

AP: కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘నకిలీ మద్యం కేసులో మా పార్టీ వాళ్లపై ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశాం. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నం కేసులోనూ 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారు. 4 పీటీ వారెంట్లు నమోదయ్యాయి’ అని సీఎం వివరించారు.
News October 12, 2025
తిరుపతి : ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రాజెక్టులో భాగంగా కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పేర్కొంది. మొత్తం 10 విభాగాలలో 56 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22.
News October 12, 2025
APలో బీచ్కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

బాపట్లలోని చీరాల బీచ్లో హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి బీచ్కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.