News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739006683794_717-normal-WIFI.webp)
మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 8, 2025
సోన్: నిజాయితీని చాటుకున్న ఉపాధ్యాయులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739018650370_51901280-normal-WIFI.webp)
నిర్మల్ మండలం కౌట్ల (కె) గ్రామానికి చెందిన గురుకుల ఉపాధ్యాయులు భూమేష్, శ్రీధర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం వారు సోన్ వైపు వెళ్తుండగా వారికి ఓ పర్సు దొరికింది. అందులో ఉన్న రూ.5000 ఉన్నాయి. ఆధార్ కార్డు ఆ పర్సు ఎవరిదో కనుక్కొని సదరు మహిళకు అందజేశారు.
News February 8, 2025
పాడేరు: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739017782543_15122836-normal-WIFI.webp)
ఆకాంక్ష జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ కుమార్ బేరీ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆకాంక్ష బ్లాక్ల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. మారుమూల గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలు, పోషకాహారం, వ్యవసాయం నీటిపారుదల సదుపాయాలు, ఆర్థిక చేకూర్పు, నైపుణ్యాభివృద్ధి మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.
News February 8, 2025
కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908528116-normal-WIFI.webp)
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.