News February 8, 2025

మేడారానికి బస్సు ప్రారంభం

image

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News February 8, 2025

అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ఓ కొడుకు పగ!

image

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా న్యూఢిల్లీ సీట్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ఓ కొడుకు పగ తోడైంది. 1998, 2003, 2008లో ఇక్కడ Ex CM షీలా దీక్షిత్ హ్యాట్రిక్ కొట్టారు. 2013లో ఆమెను ఓడించి AK CM అయ్యారు. ఇక్కడ 3 సార్లు గెలిచిన ఆయన ఈసారి 4089 ఓట్లతో ఓడారు. షీలా కొడుకు సందీప్ దీక్షిత్‌ (INC)కు ఇక్కడ వచ్చిన ఓట్లు 4568. వీటిని చీల్చకపోతే AKదే విజయం. ఇలా తన తల్లి ఓటమికి ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు.

News February 8, 2025

సంచలన వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ సీఎం అవుతారు

image

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఓటమితో డీలా పడ్డ కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత సీఎం భగవంత్ మాన్‌ను కేజ్రీవాల్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. పంజాబ్‌కు హిందూ వ్యక్తి సీఎం అవుతారని రాష్ట్ర AAP అధ్యక్షుడు అమన్ అరోరా కూడా ఇటీవల అన్నారు’ అని బజ్వా గుర్తుచేశారు.

News February 8, 2025

జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం: WGL కలెక్టర్

image

WGL జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద చైర్ పర్సన్ హోదాలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీలతో కలిసి జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!