News December 23, 2025

మేడారానికి 36 రోజులే.. నత్తనడకన పనులు!

image

మేడారం జాతరకు మరో 36 రోజులే గడువు ఉంది. సరిగ్గా జాతరకు 15 రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు జనం వస్తుంటారు. జాతర ప్రాంతంలో జరుగుతున్న పనులు నెమ్మదిగా కొనసాగుతన్నాయి. మరోపక్క మేడారానికి చేరుకునే రోడ్లపై ఉన్న వంతెనలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జాతర పనులను సమ్మక్క మాల ధరించి అధికారులు అందరూ ఇక్కడే ఉండి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా, అంతా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

image

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్‌ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.

News December 26, 2025

ప్రతి పనికీ AI ఉపయోగిస్తున్నారా?

image

ప్రతి చిన్న పనికీ AI టూల్స్‌ను ఉపయోగించే అలవాటు పెరుగుతోంది. కానీ ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొంతమంది విద్యార్థులను మూడు విభాగాలుగా చేసి.. వారిని ChatGPT, Google Gemini సాయంతో పాటు సొంతంగా ఎస్సే రాయమన్నారు. AIని ఉపయోగించిన వారి ఆలోచనల్లో చురుకుదనం లేదని గుర్తించారు. అధికంగా AIపై ఆధారపడితే జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

News December 26, 2025

HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

image

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్‌ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.