News February 12, 2025
మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325851755_15795120-normal-WIFI.webp)
ఘట్కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్పేట, జవహర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.
Similar News
News February 12, 2025
NRPT: ప్రేమికుల రోజు అడ్డుకుంటాం: బజరంగ్ దళ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361378249_51550452-normal-WIFI.webp)
నారాయణపేటలో ప్రేమికుల రోజును అడ్డుకుంటామని బజరంగ్ దళ్ ఉమ్మడి పాలమూరు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రవణ్, విహెచ్పి పట్టణ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. బుధవారం నారాయణపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రేమికులకు వ్యతిరేకం కాదని అన్నారు. 2019 ఫిబ్రవరి 14 రోజు పుల్వామా దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారని, ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దినోత్సవంగా నిర్వహించుకుందామని చెప్పారు.
News February 12, 2025
KNR: విద్యార్థుల్లో కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739359366634_50202864-normal-WIFI.webp)
విద్యార్థులు దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ఉపాధ్యాయుల గుర్తించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన హస్తకళ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కస్తూర్బా బాలికల పాఠశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాకృతులను పరిశీలించారు.
News February 12, 2025
అమ్మాయిలూ.. క్యాబ్ బుక్ చేస్తున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344809482_746-normal-WIFI.webp)
ఉబర్లో క్యాబ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ వాట్సాప్లో అసభ్యకరంగా మెసేజ్లు పంపించి ఇబ్బందికి గురిచేశాడు. కేరళలోని కట్రికడావులో ఓ మహిళ ‘ఉబర్’లో క్యాబ్ బుక్ చేసింది. అయితే, రెండు రోజుల తర్వాత ఆమె వాట్సాప్కు అపరిచిత వ్యక్తి నుంచి ‘మీరు వాడే స్ప్రే ఏ కంపెనీ’ అని మెసేజ్లు రావడంతో ఆమె అతణ్ని బ్లాక్ చేసింది. ట్విటర్లో ఈ విషయాన్ని ‘ఉబర్’కు తెలియజేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరలవుతోంది.