News April 1, 2025
మేడ్చల్లో 33 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో యాసంగి సీజన్లో సాధారణ వరిపంట సాగు విస్తీర్ణం 10,454 ఎకరాలు కాగా, రైతులు 11,015 ఎకరాల్లో వరి పంట వేశారు. వరి దిగుబడి 33 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. రైతుల నుంచి పంట మంచి దిగుబడి సాధించడంతో జిల్లాలో మున్ముందు ఆహార ఉత్పత్తిలో వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
Similar News
News April 2, 2025
కర్నూలు: TODAY TOP NEWS

➤ రేపు కర్నూలుకు YS జగన్ రాక➤ కర్నూలు- విజయవాడ విమాన సర్వీసులపై చర్చించిన మంత్రి టీజీ➤ బీటీ నాయుడు ప్రమాణ స్వీకారానికి మంత్రాలయం నేతలు➤ ఎమ్మిగనూరు గాంధీ నగర్లో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం➤ కర్నూలు జిల్లాకు వర్ష సూచన➤ కర్నూలు: నకిలీ డాక్యుమెంట్లతో కోట్లు స్వాహా➤ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసనలు➤ నంది అవార్డు గ్రహీతకు ఆదోని DSP అభినందన ➤గోనెగండ్లలో పర్యటించిన సబ్ కలెక్టర్
News April 2, 2025
అందుకే గోవాకు మారుతున్నా: జైస్వాల్

తాను ముంబై టీమ్ నుంచి <<15967764>>గోవా జట్టుకు మారడంపై<<>> యశస్వీ జైస్వాల్ స్పష్టతనిచ్చారు. గోవా క్రికెట్ అసోసియేషన్ తనకు లీడర్షిప్ రోల్ ఆఫర్ చేసిందని, అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలిపారు. ఇది చాలా కష్టతరమైన నిర్ణయమని, తన ఎదుగుదలకు కారణమైన ముంబై సిటీ, MCAకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టీమ్ ఇండియా తరఫున రాణించడం, గోవా జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు.
News April 2, 2025
విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు

విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు వేయనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ -బరాంపూర్ ఎక్స్ ప్రెస్ (18526/25)కు ఏప్రిల్ 1నుంచి ఏప్రిల్ 30 వరకు 2 జనరల్ కోచ్, విశాఖ-రాయ్పూర్ (58528/27)కు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వరకు ఒక జనరల్ కోచ్, విశాఖ- కొరాపుట్(58538/37) ఒక జనరల్ కోచ్, విశాఖ-భవానీపట్నం పాసంజర్కు (58504/03)ఒక జనరల్ కోచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.