News February 23, 2025
మేడ్చల్: అవుషాపూర్ VBIT కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఘట్కేసర్ పీఎస్ పరిధి అవుషాపూర్ వీబీఐటీ కళాశాల సమీపంలో యాష్ లోడ్ లారీ యాక్టివా నడుపుతున్న యశ్వంత్(18) అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలం జమీల్పేటకు చెందిన యశ్వంత్, జమీల్పేట నుంచి బీబీ నగర్ వైపు వెళ్తుండగా వీబీఐటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 8, 2025
ఆవులు, గొర్రెల మందలను పొలాల్లో ఉంచితే లాభమేంటి?

కొందరు రైతులు పంట కోత తర్వాత లేదా మరో పంట నాటే ముందు గొర్రెలు, ఆవుల మందలను పంట పొలాల్లో కట్టడం, ఉంచడం చూస్తుంటాం. దీని వల్ల లాభాలున్నాయ్. ఆ పశువుల మూత్రం, పేడ, గొర్రెల విసర్జితాల వల్ల భూమిలో, పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. భూమికి క్షారత్వం తగ్గి.. సారం పెరుగుతుంది. ఫలితంగా పంట నాణ్యత, దిగుబడులు పెరుగుతాయి. తర్వాతి పంటకు ఎరువులపై పెట్టే ఖర్చు 30 నుంచి 40 శాతం తగ్గించుకోవచ్చు.
News November 8, 2025
టీడీపీ కార్యకర్తలకు రూ.135 కోట్లు ఖర్చు చేశాం: లోకేశ్

కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలే పార్టీకి అధినేతలన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ.135 కోట్లు ఖర్చు చేశామన్నారు. సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
News November 8, 2025
చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

ఇటీవల ముగిసిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ డిజిటల్ వ్యూయర్షిప్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లను జియో హాట్స్టార్లో 446 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ ప్రకటించింది. ఉమెన్ క్రికెట్లో ఇదే అత్యధికమని, 3 వరల్డ్ కప్ల టోటల్ వ్యూయర్షిప్ కంటే ఎక్కువని పేర్కొంది. అలాగే భారత్-సౌతాఫ్రికా ఫైనల్ను 185 మిలియన్ల మంది చూశారని వివరించింది. ఇది 2024 మెన్స్ T20WC ఫైనల్తో సమానమని వెల్లడించింది.


