News February 23, 2025

మేడ్చల్: అవుషాపూర్ VBIT కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఘట్‌కేసర్ పీఎస్ పరిధి అవుషాపూర్ వీబీఐటీ కళాశాల సమీపంలో యాష్ లోడ్ లారీ యాక్టివా నడుపుతున్న యశ్వంత్(18) అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలం జమీల్‌పేటకు చెందిన యశ్వంత్, జమీల్‌పేట నుంచి బీబీ నగర్ వైపు వెళ్తుండగా వీబీఐటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 15, 2025

VJA: వాట్సాప్‌లో కనకదుర్గమ్మ ఆర్జిత సేవల టికెట్లు

image

విజయవాడలో ఈ నెల 22 నుంచి OCT 2 వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను EO శీనానాయక్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. https://kanakadurgamma.org/en-in/home, ప్రభుత్వ వాట్సప్ సేవల నంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చన్నారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్‌లైన్‌లో ఆర్జితసేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చన్నారు.

News September 15, 2025

కృష్ణా: నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన SP

image

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

News September 15, 2025

కృష్ణ: 100 ఏళ్ల నాటి నిజాం కాలం వంతెన

image

నిజాం కాలంలో నిర్మించిన పురాతన రాతి వంతెన వందేళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. గచ్చుతో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలు ముంచెత్తిన చిన్న మరమ్మతు కూడా అవసరం రాలేదు. NRPT జిల్లా కృష్ణ మండలం వాసునగర్- శక్తి నగర్ మధ్య ఈ వంతెన నిర్మించారు. నిర్మాణ శైలి అర్ధ చంద్రాకారంలో ఉండే 18 ఖానాల (వెంట్)తో ఈ వంతెన నిర్మించారు. ఖానా మధ్యలోని రాయి భారం మోస్తుందని ఇంజినీరింగ్‌ల అభిప్రాయం. నేడు ఇంజినీర్ల దినోత్సవం.