News February 11, 2026

మేడ్చల్: ఎంసీపల్లిలో ఓటేసిన 102 ఏళ్ల ఎల్లమ్మ

image

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 102 ఏళ్లున్న దాసరి ఎల్లమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎందుకు వేయాలని భావిస్తున్న ఎందరికో ఈ బామ్మ ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని ఎల్లమ్మ చెబుతున్నారు.

Similar News

News February 11, 2026

మేడ్చల్‌లో 83.99 శాతం పోలింగ్

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎల్లంపేట 83.27, అలియాబాద్ 79.62, మూడుచింతలపల్లి 89.07 కలిపి మొత్తం 83.99 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఈ పోలింగ్‌లో పురుషుల కంటే మహిళలే తమ ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకున్నారు.

News February 11, 2026

కోరుట్ల మున్సిపాలిటీలో 69.46% పోలింగ్

image

కోరుట్ల మున్సిపాలిటీలో మొత్తం 69.46% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పట్టణంలోని మొత్తం 33 వార్డులలో 63,507 మంది ఓటర్లు ఉండగా.. 44,115 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు వివరించారు. ఈనెల 13న కౌంటింగ్ జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాలలో జరగనుంది.

News February 11, 2026

కామారెడ్డి: 45,629 మంది ఓటు హక్కు వినియోగించుకో లేదు

image

కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 1,49,525 ఓటర్లకు గాను 1,03,896 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 45,629 మంది ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. మొత్తం జిల్లాలో 69.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో మహిళలు అత్యధికంగా 54,487, పురుషులు 49,393 మంది, ఇతరులు 16 మంది ఓటు వేశారు.