News November 19, 2025

మేడ్చల్: ‘కాలుష్యానికి కారణ భూతంగా.. ఈ పరిశ్రమలు..!

image

మల్లాపూర్, నాచారం, చర్లపల్లి, కీసర, ప్రశాంత్ నగర్, బొల్లారం, జీడిమెట్ల సహా పలు ప్రాంతాల్లో 60కి పైగా అనుమతులు లేని పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమలు తమ రోజువారీ ఉత్పత్తుల సామర్థ్యం మేరకు వ్యర్థ ద్రవాల శుద్ధి సదుపాయాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తేలింది. ఇవే కాలుష్యానికి ప్రధాన కారణభూతంగా మారుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

Similar News

News March 6, 2026

ఏసీలు కొనేవారికి షాక్

image

వేసవి ప్రారంభంలోనే ఏసీ ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే LG, హిటాచీ దాదాపు 5-7 శాతం రేట్లను పెంచాయి. రానున్న 3-10 రోజుల్లో బ్లూ స్టార్, వోల్టాస్, ఇతర బ్రాండ్లు 10-15 శాతం మేర ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. పెరిగిన ముడి సరకు ధరలను భర్తీ చేసుకోవడానికి కంపెనీలు వేసవి డిమాండ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా AC కంప్రెసర్లు, కాయిల్స్‌లో వాడే <<19232225>>రాగి రేటు<<>> భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

News March 6, 2026

ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలి: భద్రాద్రి కలెక్టర్

image

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు సూచనలు చేశారు.

News March 6, 2026

గిరిజన ప్రాంతాల్లో విద్యుద్దీకరణకు ప్రాధాన్యం: సీఎండీ

image

గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాల విస్తరణకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. ఈఆర్సీ బహిరంగ విచారణలో మాట్లాడుతూ.. PM-JANMANపథకం కింద దూర ప్రాంతాల్లోని 3360 ఇళ్లకు ఆన్‌గ్రిడ్ ద్వారా, 90 ఇళ్లకు ఆఫ్‌గ్రిడ్ ద్వారా విద్యుద్దీకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. అలాగే STSDF పథకం ద్వారా గుర్తించిన 2222 గిరిజన ఆవాసాల్లో 2072 ప్రాంతాల్లో విద్యుద్దీకరణ చేశామన్నారు.