News March 14, 2025

మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (2/2)

image

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట పేర్లతో మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో.. శ్రీరంగవరం, బండమాధరం, నూతనకల్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం, రావల్‌కోల్, కండ్లకోయ, రాజ్‌బొల్లారం, ఘన్పూర్, గోసాయిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ నెల 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

Similar News

News October 23, 2025

సంగారెడ్డి: ‘పాఠశాలల వివరాలను నమోదు చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ, ప్రవేట్ పాఠశాలల వివరాలను ఇకో క్లబ్ పోర్టర్‌లో రేపు మధ్యాహ్నం 12 గంటలలోగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. వివరాలను నమోదు చేయని పాఠశాలలపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.

News October 23, 2025

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

image

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవార్ల ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనలు వల్లించగా.. ఈవో శ్రీనివాసరావు శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.

News October 23, 2025

₹6500 కోట్లతో పల్లె పండుగ 2.0

image

AP: గ్రామాల రూపురేఖలు మార్చేలా పల్లె పండుగ-2.0కు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికోసం ₹6500 కోట్లతో 52వేల పనులు చేపట్టి సంక్రాంతికి పూర్తి చేసేలా ప్లాన్ రూపొందిస్తోంది. ఈనెలాఖరు లేదా నవంబర్ తొలివారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. గతేడాది ఇదే ప్రోగ్రాం కింద ₹4500 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కూడా గతంలో మాదిరి రోడ్లు, కాలువలు, గోకులాలతో పాటు 1107 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రెయిన్ ఇతర పనులు చేపట్టనున్నారు.